తరుణ్ భాస్కర్ కొత్త అవతారం..?

పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు తెరకి న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీని పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ సినిమాతో మంచి విజయం అందుకోవడమే కాదు తను రాసిన మాటలకి జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. అయితే పెళ్ళి చూపులు తర్వాత తాను దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది మూవీకి అంతగా అప్లాజ్ రాలేదు. నగరానికి ఏమైంది వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న తరుణ్ నుండి మరో సినిమా రాలేదు.
ఈ రెండు సంవత్సరాల గ్యాప్ లో తరుణ్ యాక్టర్ గా మారి ఫలక్ నుమా దాస్ లో ఓ చిన్న క్యారెక్టర్ చేసి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఫలక్ నుమా దాస్ ఇచ్చిన ప్రోత్సాహంతో హీరోగా మారి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా తీశాడు. విజయ్ దేవరకొండ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. నటన పరంగా తరుణ్ బాగానే చేసినప్పటికీ బాక్సాఫీసు వద్ద సినిమా ఫ్లాప్ అయింది.
దాంతో నటనకి కూడా గ్యాప్ వచ్చేసింది. మొన్నటి వరకు తరుణ్ వెంకటేష్ తో హార్స్ రేసింగ్ నేపథ్యంలో సినిమా తీస్తున్నాడని, ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం తరుణ్ ఈటీవీ ప్లస్ లో స్టార్ట్ కాబోతున్న నీకు మాత్రమే చెప్తా ప్రోగ్రామ్ కి యాంకర్ గా మారబోతున్నాడట. ఈ ప్రోగ్రామ్ హిందీలో వచ్చే కాఫీ విత్ కరణ్ మాదిరిగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ నుండి హీరోగా మారి, హీరో నుండి యాంకర్ గా మారబోతున్న తరుణ్ కి ఇక్కడైనా సక్సెస్ సాధిస్తాడా లేదా చూడాలి.
Director Tharun Bhaskar Taking new turn in his career
Tharun Bhaskar Turning as Anchor..?








































