Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> What is the Reason of Silence on Baahubali?

'బాహుబలి'పై మౌనానికి కారణం ఏమిటి..?

తాజాగా 'బాహుబలి'ని చూసి బాలీవుడ్‌ మేకర్స్‌ భయపడుతున్నారని, ఎవరో ఒకరిద్దరు శేఖర్‌కపూర్‌ వంటి వారు ఆ చిత్రాన్ని మెచ్చుకున్నారే గానీ.. అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌,షారుఖ్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ దర్శకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే వార్త సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇది నిజమే. స్వయాన కరణ్‌జోహార్‌ వంటి వ్యక్తి ఈ చిత్రాన్ని విడుదల చేసినా ఆయన కాంపౌండ్‌కు చెందిన వారు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారనే వాదన వినిపిస్తోంది. 

ఇక 'బాహుబలి'ని పొగడకపోయినా ఫర్వాలేదు.. కానీ కమాల్‌ఖాన్‌లా వెగటుగా మాట్లాడటం కాకుండా కనీసం తప్పొప్పులను ఎత్తి చూపుతూనే ఆ చిత్రం గురించి విశ్లేషణ చేయడంలేదు..? ఇక మనం బాలీవుడ్‌ వారిని అంటున్నాం కానీ, టాలీవుడ్‌, కోలీవుడ్‌లకు చెందిన కొందరు ప్రముఖులే మాట్లాడారు కానీ సీనియర్‌ దర్శకదిగ్గజాలుగా పిలువబడే వారు ఎవ్వరూ ఇక్కడ కూడా ఎంతో మంది మౌనంగా ఉంటున్నారు. మరి ఈ మౌనానికి కారణం ఏమిటి? సినిమా గొప్పతనాన్ని చూసి ఓర్వలేకపోతున్నారా? లేక అదేమంత గొప్ప సినిమా కాదని భావిస్తున్నారా? అనేది అర్ధం కాని విషయం. 

Bollywood makers are scared of the latest 'Baahubali 2', some of whom are like Shekar Kapoor who are impraising the film. But Amir Khan, Salman Khan, Shahrukh Khan and Hrithik Roshan are also in the news of the news that many Bollywood directors are silent on baahubali news in social media.

What is the Reason of Silence on Baahubali?
baahubali
rajamouli
karan johar
salman khan
shahrukh khan