Advertisement

'రోజులు మారాయి' పాటల రెస్పాన్స్ బావుంది!

Tue 21st Jun 2016 09:02 PM
rojulu marayi,maruthi,dil raju,jb,murali krishna  'రోజులు మారాయి' పాటల రెస్పాన్స్ బావుంది!
'రోజులు మారాయి' పాటల రెస్పాన్స్ బావుంది!
Advertisement

దిల్ రాజు సమర్పకుడిగా, మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం 'రోజులు మారాయి'. మారుతి కథ, స్క్రీన్ ప్లే అందించగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.బి. సంగీతం అందించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 1న విడుదలకు సిద్ధంగా ఉంది. జె.బి. సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

సంగీత ద‌ర్శ‌కుడు జె.బి మాట్లాడుతూ.. '' ఇటీవల విడుదలయిన ఈ చిత్ర పాటలకు శ్రోతల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదట దిల్ రాజు గారి సినిమాలో మ్యూజిక్ చేయడానికి భయపడ్డాను. కాని ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజు, మారుతిగారికి థాంక్స్‌. ఈ చిత్రంలో కాసర్ల శ్యామ్ నాలుగు పాట‌లు, కిట్టు ఒక పాట‌ను రాశారు. సింగర్స్ కూడా మంచి సపోర్ట్ అందించారు'' అని చెప్పారు. 

కాస‌ర్ల‌శ్యామ్ మాట్లాడుతూ.. ''ఈరోజుల్లో సినిమా నుండి నేను జెబి గారి సినిమాలకు రాస్తున్నాను. ఈ సినిమాలో నాలుగు పాటలు రాసే అవకాశాన్ని కల్పించారు. జెబిగారు గారు మ్యూజిక్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. ఆడియోలానే సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో ర‌మ్య‌బెహ‌ర, అనుదీప్‌, రోహిత్‌, లిప్సిక‌, న‌య‌న త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే- మారుతి, సమర్పణ- దిల్ రాజు, సంగీతం- జె.బి, మాటలు- రవి నంబూరి, దర్శకత్వం- మురళి కృష్ణ ముడిదాని.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement