దిల్ రాజు బ్యానర్ లో వంశి పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖన్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం రీసెంట్ గానే అనౌన్సమెంట్ తో హాట్ టాపిక్ గా మారింది. వంశి పైడిపల్లి ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.
అందులో భాగంగా వంశీ పైడిపల్లి-దిల్ రాజు-సల్మాన్ ఖాన్ ల మూవీ పూజా కార్యక్రమాలను ముంబై లో నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమానికి నయనతార కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 18 తర్వాత పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనున్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఈ చిత్రం మేజర్ షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాల్లోనే ఉండబోతుంది అని, దిల్ రాజు ఈ చిత్రం కోసం అన్ని ప్రిపేరేడ్ గా ఉన్నారని భారీ బడ్జెట్ పెట్టేందుకు దిల్ రాజు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. సో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఏ చిన్న అప్ డేట్ అయినా నిమిషాల్లో వైరల్ అవుతోంది.