మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అన్ని పనులుపూర్తి చేసి ఏప్రిల్ 30న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఈ చిత్రానికి పని చేస్తున్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియా వేదికగా సినిమా పురోగతిపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. బుచ్చిబాబు సానా - ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లాలతో కలిసి సెట్స్ పనులను పర్యవేక్షిస్తున్న ఫొటోను పంచుకున్నారు. సినిమాలో విజువల్స్ అత్యంత సహజంగా, అద్భుతమైన రీతిలో ఉండబోతున్నాయని ఇచ్చిన హింట్ అభిమానుల్లో సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.
గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్ను, లుక్ను పూర్తిగా మార్చుకున్నారు. రత్నవేలు అద్భుతమైన విజువల్స్తో పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై ఒక దృశ్యకావ్యంలా ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. గతంలో రామ్ చరణ్ నటించిన `రంగస్థలం` చిత్రానికి కూడా రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఆ చిత్రం విజువల్ పరంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ అదే తరహా మ్యాజిక్ `పెద్ది`లోనూ పునరావృతం కాబోతోందని టీమ్ అప్డేట్స్ సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఆడియో పరంగా గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉండబోతోంది. రామ్ చరణ్ కెరీర్లోనే ఇది ఒక విభిన్నమైన , భావోద్వేగపూరితమైన చిత్రంగా నిలుస్తుందని రత్నవేలు విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.