కోలీవుడ్ లో శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన తాయ్ కెలవి థియేటర్స్ లో సంచనాలు సృష్టించింది. ఫిబ్రవరి 27 న థియేటర్స్ లో విడుదలైన తాయ్ కెలవి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు వారాల్లో రూ. 80.16 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.
థియేటర్స్ లో అనుకోని హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ డెబ్యూ కి రెడీ అయ్యింది. తాయ్ కెలవి స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన 6 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన ప్రకారం డీల్ కుదిరింది.
ఆ డీల్ ప్రకారమే రాధికా శరత్ కుమార్ తాయ్ కెలవిని ఏప్రిల్ 10 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా జియో హాట్ స్టార్ అఫీషియల్ గా ప్రకటించింది.