దర్శకుడు వంశి పైడిపల్లి కోలీవుడ్ హీరో విజయ్ వారసుడు సినిమా చేసాక మళ్ళీ చాలా రోజులకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా అనౌన్స్ చేసారు. అది కూడా దిల్ రాజు నిర్మాణంలో.. వంశి పైడిపల్లి ఏ సినిమా చేసినా దిల్ రాజు నిర్మాతగానే ఉంటారు. వంశి ఫాదర్ కి దిల్ రాజు కి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది.
కానీ వారసుడు లాంటి చిత్రం తీసాక మళ్లీ దిల్ రాజు వంశి పైడిపల్లి పై ఎందుఇంత నమ్మకం పెట్టుకున్నారు. ఏరి కోరి బాలీవుడ్ స్టార్ ని వంశి చేతుల్లో పెట్టారు. వంశి పైడిపల్లి తో సల్మాన్ ఖాన్ కాంబినేషన్ అంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిందే. మరి రాజు గారికి పైడిపల్లిపై ఎందుకింత గురి. వంశీ నుంచి వారసుడు వచ్చిన మూడేళ్లకు సల్మాన్ తో దిల్ రాజు వంశీకి సినిమా సెట్ చేసారు.
దీని కోసం నెలల తరబడి డిస్కషన్లు, నెరేషన్లలో ఉండగా ఫైనల్ గా ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది అని అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఈచిత్రం కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను ఒప్పించడం మరో స్పెషల్ అని చెప్పాలి.
మరి దిల్ రాజు కి వంశి పైడిపల్లి పై ఎంత నమ్మకం లేకపోతే వంశి పైడిపల్లి కోసం ప్రత్యేకంగా బాలీవుడ్ స్టార్ హీరోని అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.