Advertisement
Google Ads BL

AA దర్శకుడి దగ్గర ఏకే-47తుపాకులు


కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో AA 22 చిత్రాన్ని చేస్తున్న అల్లు అర్జున్ ఆ చిత్ర షూటింగ్ లో బిజీగా వున్నారు. రీసెంట్ గానే తమ్ముడు అల్లు శిరీష్ వివాహ వేడుకల్లో పాల్గొని, తర్వాత భార్య స్నేహ రెడ్డి తో కలిసి ఓ చిన్నపాటి ట్రిప్ వేసిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ తన తడుపరి మూవీని కూలి దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో అనౌన్స్ చేసారు.

Advertisement
CJ Advs

అయితే లోకేష్ కనగరాజ్ కి సంబందించిన ఏకే-47 తుపాకులు తమిళనాడు పోలీస్ లకు చిక్కడం హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఏకే-47 తుపాకులు దొరకడంతో అవాక్కయ్యారు, కానీ అవి డమ్మీ తుపాకులు అని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

చెన్నై అశోక్ నగర్ లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ మినీ వ్యాన్ ని తనిఖీ చేయగా అందులో ఏకే-47 రకం తుపాకులు కనిపించాయి. దానితో షాకయినా పోలీసులు ఆ వ్యాను డ్రైవర్ మహేంద్రన్ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా అవి డమ్మీ తుపాకులని, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న డీసీ సినిమా చిత్రీకరణలో వాటిని వాడుకుని, తర్వాత వడపళనిలోని దుకాణంలో అప్పగించడానికి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. 

అంతేకాకుండా ఆ తుపాకులకు సంబందించిన తగిన పత్రాలను సమర్పించడంతో ఆ వ్యానును విడిచిపెట్టారు.

Lokesh Kanagaraj:

Lokesh Kanagaraj AK47
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs