అఖండ 2 రిజల్ట్ తర్వాత నందమూరి బాలకృష్ణ చెయ్యబోయే NBK 111 ప్రాజెక్ట్ కి సంబందించిన బడ్జెట్ విషయంలో జరిగిన చర్చలతో ఆ స్క్రిప్ట్ పక్కనపెట్టి పక్కా కమర్షియల్ కథతో గోపీచంద్ మలినేని బాలయ్య NBK 111 ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. అయితే సైలెంట్ గా బాలయ్య NBK111 సెట్ లోకి వెళ్లిపోయారు.
కామ్ గా గోపీచంద్ మలినేని తో నందమూరి నటసింహం షూటింగ్ లో పాల్గొనడం అభిమానులను సర్ ప్రైజ్ చేసినా కొంతమంది బాలయ్య ఎందుకు ఇంత సైలెంట్ గా షూటింగ్ కి వెళ్లిపోయారు. ఎలాంటి హడావిడి లేకుండా గోపీచంద్ మలినేని కూడా షూటింగ్ స్టార్ట్ చేసేసాడు అంటూ చేస్తున్న కామెంట్స్ కి అభిమానులు కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన మరోమారు లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. విలన్ గా మంచు మనోజ్ కనిపించబోతున్నాడనే క్రేజీ న్యూస్ వినబడుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని గోపీచంద్ మలినేని ఇంకా నిర్మాతలు వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చెయ్యాలనే కసితో సినిమాని స్టార్ట్ చేసారు.