సూపర్ స్టార్ మహేష్ తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. గ్లోబల్ వైడ్ గా వారణాసి పై అంచనాలు పెంచుతూ రాజమౌళి మరియు హీరో మహేష్ బాబు, విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్, హీరోయిన్ ప్రియాంక చోప్రాల ఇంటర్వూస్ లో వారిచ్చే అప్ డేట్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ప్రస్తుతం వారణాసి కోసం మంచు కొండల్లో ఓ భారీ యాక్షన్ ఘట్టాన్ని మహేష్-పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే కొంతమంది కీలక నటులపై రాజమౌళి తెరకెక్కించారని తెలుస్తుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ వారణాసి సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలవబోతోంది అని యూనిట్ వర్గాలు చెబుతున్న మాట.
ఇప్పటికే చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వారణాసి చిత్రం జూన్ లేదా జులై కల్లా మిగతా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి దిగుతుంది అని, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమాని విడుదల చేసందుకు రాజమౌళి పక్కా ప్లానింగ్ తో కనిపిస్తున్నారు.