హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయ్యింది. సౌత్ లో స్టార్ హీరో ల సరసన క్రేజీ మూవీస్ లో నటించిన రకుల్ ప్రీత్ కి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గగానే బాలీవుడ్ కి బిషానా ఎత్తేసింది. అక్కడే ముంబై లో ఉంటూ అవకాశాలు వెతుక్కుంది. చాల ఏళ్ళ తర్వాత గత ఏడాది ఫైనల్లీ ఓ హిట్ అందుకుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రకుల్ ప్రీత్ గ్లామర్ ఫోటో షూట్స్ తో అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంటుంది. అవార్డ్స్ వేడుక అయినా, సినిమా ఈవెంట్ అయినా, పెళ్లి అయినా, పేరంటం అయినా రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ గా కనిపించాల్సిందే.
తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో రకుల్ ప్రీత్ గ్రే కలర్ డిజైనర్ శారీ లో మెరిసింది. ఆ స్పెషల్ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే అవి ఇట్టే వైరల్ గా మారాయి. మీరు కూడా రకుల్ ప్రీత్ బ్యూటిఫుల్ లుక్ ని చూసెయ్యండి.