ఈ నెల 26 న రాజస్థాన్ ఉదయ్ పూర్ వేదికగా టాప్ హీరోయిన్ రష్మిక మందన్న - హీరో విజయ్ దేవరకొండ లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. పెళ్లి విషయంలో రశ్మిక-విజయ్ దేవరకొండ లు చాలా సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారు. అక్కడ రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ రష్మిక-విజయ వెడ్డింగ్ కోసం ముస్తాబవుతోంది.
అయితే వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, అలాగే అత్యంత సన్నిహితులు, కొద్దిమంది స్నేహితుల నడుమ గ్రాండ్ గా జరగబోతుంది అని తెలుస్తుంది. ఫిబ్రవరి 26 న పెళ్లి చేసుకుని ఏడడుగులు నడవబోతున్న రష్మిక-విజయ్ దేవరకొండ జంట మార్చి 4 న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారట.
రష్మిక-విజయ్ దేవరకొండ ల వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులు హాజరవుతారని, బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో హైలెట్ అవుతారని తెలుస్తుంది.