మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం సీరీస్ ఎంత పెద్ద హిట్టో తెలిసిన విషయమే. దృశ్యం 1, దృశ్యం 2 చిత్రాలు వేటికవే ప్రత్యేకమైనవి. ఊహలకందని ట్విస్ట్ లతో జీతూ జోసెఫ్ మోహన్ లాల్ కేరెక్టర్ ని నడిపించితిన తీరుకు ప్రేక్షకులు కాదు కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు.
ఇప్పుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న దృశ్యం 3 చిత్రం ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. అయితే దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాల్లో ఉన్న ట్విస్ట్ లు దృశ్యం 3 లో ఊహించుకోకండి, దృశ్యం 3 కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అని జీతూ జోసెఫ్ చెప్పేసారు. కాకపోతే దృశ్యం 3 క్లైమాక్స్ పై ఈ చిత్ర నటి ఆశా శరత్ తాజాగా పెంచిన అంచనాలు మాత్రం వేరే లెవల్.
దృశ్యం 3 క్లైమాక్స్ చూసి స్టన్ అయిపోతారు. అసలీలు ఇది నిజమేనా అని షాకైపోతారు. ఆడియన్స్ కుర్చీ అంచున కూర్చోబెట్టే సినిమా ఇది అంటూ ఆశా శరత్ దృశ్యం 3 క్లైమాక్స్ పై అంచనాలు పెంచేశారు. మరి ఏప్రిల్ 2 న దృశ్యం 3 కక్లైమాక్స్ కోసమైనా థియేటర్స్ కి వెళ్లాల్సిందే.