ఫ్యామిలీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కింగ్ నాగార్జున తో తెరకెక్కించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం హిట్ అవడంతో.. ఆతర్వాత బంగార్రాజు అంటూ నాగార్జున తో నాగ చైతన్య కలిపి హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ చాలా పెద్ద బ్రేక్ తీసుకుని మళ్లీ నాగార్జునతోనే మరో మూవీకి శ్రీకారం చుట్టాడు. వాసివాడి తస్సాదియ్యా అంటూ సోగ్గాడే చిన్న నాయనకు సీక్వెల్ ని అనౌన్స్ చేసారు.
2027 సంక్రాంతికి అంటే జనవరి 15 రిలీజ్ అంటూ ప్రకటన కూడా ఇచ్చేసారు. మరి వాసివాడి తస్సాదియ్యా లో నాగార్జున తో పాటుగా నాగ చైతన్య ఈసారి అఖిల్ ని కూడా కళ్యాణ్ కృష్ణ దించబోతున్నాడని తెలుస్తుంది. అక్కినేని ప్రిన్స్ అఖిల్ కూడా వాసివాడి తస్సదియ్యలో యాడ్ అయితే వచ్చే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్నారు.
నిజంగానే నాగ్ తో కొడుకులిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే మాములుగా ఉండదు, వాసివాడి తస్సాదియ్యా అని టైటిల్ కి తగ్గట్టుగానే పండగ సీజన్ హీటెక్కిపోవడం ఖాయం. మరి నాగార్జున-నాగ చైతన్య-అఖిల్ బిగ్ స్క్రీన్ పై కలిసి కనిపిస్తే అభిమానులు ఆగుతారా..