సూపర్ స్టార్ మహేష్ తో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఆతర్వాత వారణాసి షూటింగ్ అవుట్ డోర్ కి మారుతుంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ లు నటిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7 రిలీజ్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు.
హాలీవుడ్ రేంజ్ లో క్రేజ్ ఉన్న వారణాసి కి సంబందించిన ఓటీటీ డీల్ వింటే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. కొద్దిరోజుల క్రితం రూ.1000 కోట్ల ఓటీటీ డీల్ వారణాసి వచ్చింది కి అంటూ ప్రచారం జరిగింది.ఇప్పుడు మాత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారణాసి మేకర్స్ తో డీల్ ఫైనల్ చేసుకునే పనిలో ఉందట.
దాదాపుగా రూ.650 కోట్ల మైండ్ బ్లోయింగ్ డీల్ ని నెట్ ఫ్లిక్స్ వారణాసి మేకర్స్ ముందు పెట్టింది అని, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ గా నిలవబోతుంది అని తెలుస్తుంది. అయితే థియేటర్స్ లో విడుదలైన చాలా కొద్దిరోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ అయ్యే కండిషన్ తోనే నెట్ ఫ్లిక్స్ ఆ రేంజ్ డీల్ వారణాసి కి ఇచ్చింది అని తెలుస్తుంది.