ఈమధ్యన సౌత్ లో కన్నడ భామల జోరు మాములుగా లేదు. కన్నడ నుంచి వచ్చిన రష్మిక మందన్న పాన్ ఇండియా మార్కెట్ ని ఏలుతోంది. అటు కాంతార 2తో పాన్ ఇండియా మర్కెట్ లో వెలిగిపోయింది రుక్మిణి వసంత్. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్స్ ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్ లో బాలీవుడ్ యాక్టర్స్ సరసన నిలిచి దుమ్ము రేపారు.
ఐఎండీబీ తాజాగా మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్ ని రిలీజ్ చేసింది. అందులో ఈ ఏడాది వరస సినిమాలే కాదు, వరస హిట్స్ తో దూసుకుపోయిన రష్మిక మందన్న, కాంతార 2 తో పాన్ ఇండియాలో హిట్ కొట్టిన రుక్మిణి వసంత్, హీరో రిషబ్ శెట్టి లు బాలీవుడ్ నటుల సరసన నిలిచి అందరికి షాకిచ్చారు.
ఈ ఏడాది అనూహ్య విజయాలతో హైలెట్ అయిన సయారా హీరోయిన్ అహాన్ పాండే, అనీత్ పడ్డా ఫస్ట్ టు ప్లేసెస్ ని తీసుకోగా.. ఆమీర్, ఇషాన్ ఖట్టర్, లక్ష్య, రష్మిక, మలయాళ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి, కన్నడ రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి , త్రిప్తి డిమ్రి లో టాప్ 10 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్ నిలిచారు.