సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనౌన్స్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ క్రేజీ నటి బెబో కరీనా కపూర్ నటిస్తుంది. ఆ తర్వాత కరీనా కపూర్ స్పిరిట్ లో నటించేందుకు 12 కోట్లు పారితోషికం అడిగింది, అందుకే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేసారు అనే టాక్ నడిచిన విషయం తెలిసిందే.
అయితే అప్పట్లో కరీనా కపూర్ అనుకున్న పాత్ర కోసం ఇప్పుడు సందీప్ వంగ మరో బాలీవుడ్ నటిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఆమె కాజోల్. ప్రముఖ నటి కాజోల్ అటు సినిమాల్లో కీలక పాత్రల్లోనూ, అలాగే వెబ్ సీరీస్ ల్లో నటిస్తూ ఈ నటి ఎప్పుడు బిజినె. అందుకే సందీప్ వంగ కాజోల్ ని ఈ చిత్రంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
స్పిరిట్ లో ప్రభాస్ కి జోడిగా త్రిప్తి డుమ్రి నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి విలన్ గా కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తారనే వార్త ప్రచారంలో ఉంది.