జూబ్లీ హిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, లేదంటే సిట్టింగ్ స్థానాల్లో ఉన్న బీఆర్ఎస్ గెలుస్తుందా.. అయితే జూబ్లీహిల్స్ ఓటర్లు ఆ విషయంలో స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్టే కనిపించింది. జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే మాగంటి గోపినాధ్ మరణానంతరం వచ్చిన బై ఎలక్షన్స్ విషయంలో ప్రస్తుతము అధికారంలో ఉన్న కాంగ్రెస్, సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకొకూడదు అని బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోటీపడ్డాయి.
గోపినాధ్ రెండో భార్య సునీత బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీపడ్డారు. ముందు నుంచి ఈ రెండు పార్టీల నడుమే పోటీ కనిపించింది. బిజెపి కానీ ఇతర పార్టీలు కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ప్రభావం చూపించలేకపోయాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికలకు సంబందించిన కౌంటింగ్ ఈ రోజు జరుగుతుంది.
మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ కొద్దిపాటి ఆధిక్యం చూపించినా.. ఆతర్వాత రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
మూడో రౌండ్ పూర్తి అయ్యే సరికి
కాంగ్రెస్
5129 లీడ్
4th రౌండ్ పూర్తి అయ్యే సరికి
కాంగ్రెస్
9000 లీడ్
పోస్టల్ బ్యాలట్ అధికారిక ప్రకటన.
చెల్లుబాటు ఐన ఓట్లు 96
కాంగ్రెస్ 43
BRS 25
BJP 20
Nota -2