దివంగత పారిశ్రామికవేత్త - బిలియనీర్ సంజయ్ కపూర్ రూ. 30,000 కోట్ల విలువైన ఆస్తులను కూడగట్టి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అతడికి ముగ్గురు భార్యలు. మూడో భార్య ప్రియా సచ్ దేవ్ తో అతడు లండన్ లో నివశిస్తున్నాడు. అయితే సంజయ్ మరణించిన తర్వాత రెండో భార్య కరిష్మా, ఆమె పిల్లలు ప్రియా సచ్ దేవ్ గుత్తాధిపత్యంపై కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. 30 వేల కోట్ల ఆస్తులకు సంబంధించి తమ వాటా తమకు దక్కాలని కరీనా పిల్లలు తండ్రి ఆస్తి కోసం కోర్టులో పోరాడుతున్నారు.
అయితే సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా సచ్ దేవ్ తన వైరి వర్గాలకు ఆస్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారం లీక్ చేయడం లేదు. సంజయ్ తల్లి కూడా తనకు చిల్లిగవ్వ ఆస్తి కూడా తన కొడుకు రాసివ్వలేదని, తనను రోడ్ పై వదిలేసారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రియా సచ్ దేవ్ పై కరిష్మా కపూర్ కోర్టులో పోరాటం సాగిస్తున్నారు.
ఈ సమయంలో సంజయ్ కపూర్ సోదరి మందిరా కపూర్ బరిలో దిగారు. తాజా పాడ్ కాస్ట్ లో మందిరా కపూర్ తన సోదరుడి భార్య ప్రియా సచ్ దేవ్ పై సంచలన ఆరోపణలు చేసారు. సంజయ్ కపూర్ - కరిష్మా కపూర్ కాపురంలో ప్రియా సచ్ దేవ్ నిప్పులు పోసిందని మందిర ఆరోపించారు. దానికి తానే ప్రత్యక్ష సాక్ష్యమని వెల్లడించారు. సంజయ్ - కరిష్మా చాలా ఆనందంగా ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డ పుట్టిన సమయంలోనే ప్రియా అతడి జీవితంలోకి ప్రవేశించింది. ఆరోజు ఆ విమానంలో ప్రియా పరిచయం తన సోదరుడు సంజయ్ ని మార్చేసిందని మందిర తెలిపారు. పచ్చని సంసారాన్ని చెడగొట్టడం సరికాదు. ఆ సమయంలో నేను నా స్నేహితురాలు కరిష్మాకు సరైన మద్ధతునివ్వలేకపోయాను అని కూడా ఆవేదన చెందారు.
నా సోదరుడి మూడో వివాహానికి ఇంట్లో ఎవరూ సమ్మతించలేదు. నాన్నగారు పూర్తిగా వ్యతిరేకించారు. అమ్మ అక్క చెల్లెలు అందరూ అతడిని వ్యతిరేకించారు. న్యూయార్క్ లో జరిగిన వివాహానికి మేం ఎవరూ వెళ్లలేదు అని నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ప్రియాను మా తండ్రి గారు ఎప్పుడూ వ్యతిరేకించారని మందిర తెలిపారు.
2017లో సంజయ్ కపూర్ - ప్రియా సచ్దేవ్ వివాహానికి తాను లేదా తన సోదరి హాజరు కాలేదని మందిర అన్నారు.
కరిష్మా కపూర్ 2003లో సంజయ్ కపూర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, 2005లో జన్మించిన సమైరా - 2011లో జన్మించిన కియాన్ ఉన్నారు. అయితే సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2016లో వివాహం విడాకులతో బంధం ముగిసింది. ప్రియా సచ్దేవ్ను మరుసటి సంవత్సరం సంజయ్ వివాహం చేసుకున్నాడు. జూన్ 2025లో అతను మరణించే వరకు వారు కలిసి ఉన్నారు.