Advertisement
Google Ads BL

సమంత-రకుల్ బాధితులుగా విచారణకు వస్తారా


తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అందరూ చూస్తున్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్ లు ట్యాప్ చెయ్యడమే కాదు, చాలామంది సినీ సెలబ్రిటీస్ ఫోన్స్ ని ట్యాప్ చెయ్యడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఫోన్ ట్యాప్ అయినవాళ్లు, చేసినవాళ్లుగా అంతా విచారణకు హాజరవుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇక గత ఏడాది కాలంగా హీరోయిన్ సమంత ఫోన్ ట్యాప్ అయ్యింది. అందుకే సమంత కు నాగ చైతన్య కు విడాకులయ్యాయనే మాట వినబడుతూనే ఉంది, అంతేకాకుండా హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫోన్ కూడా ట్యాప్ చేసారు, ఆమె కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటుంది అంటూ రకుల్-కేటీఆర్ లపై ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. 

అయితే సమంత, రకుల్ ప్రీత్ ల ఫోన్స్ మాత్రమే కాదు మరో హీరోయిన్ హెబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సమంత, రకుల్ ప్రీత్ లకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇస్తారా.. సమంత, రకుల్ ప్రీత్ బాధితులుగా విచారణకు వస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. 

Telangana Phone Tapping Case Shocking Facts:

Phone Tapping Case Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs