Advertisement
Google Ads BL

రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు


చంద్రబాబు అయితే సాఫ్ట్ గా ఉంటారు, ఏం మాట్లాడినా వదిలేస్తారు, మనమేం చేసినా ఇబ్బంది ఉండదు అని విర్రవీగే వైసీపీ నేతలకు నారా లోకేష్ ని చూస్తే మాత్రం ఒణుకుపుడుతుంది. నారా లోకేష్ రెడ్ బుక్ పేరెత్తితే చాలు వైసీపీ నాయకుల్లో, తప్పు చేసిన వాళ్ళ వెన్నులో నుంచి భయం పుడుతుంది. అదే మాట మినిస్టర్ నారా లోకేష్ కూడా చెబుతున్నారు. రెడ్‌బుక్‌ అనే పేరు చెబితే చాలు వైసీపీ నేత‌లకు గుండెల్లో దడ మొదలవుతోందని లోకేష్ ఓ కార్యక్రమంలో కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

సమాజంలో మార్పు రావాలి, ముఖ్యంగా మహిళల పట్ల ప్రవర్తించే తీరు, మహిళల పట్ల నడుచుకునే తీరులో మార్పు రావాలి, మార్పు అనేది కేవలం చట్టాలు చేయడం ద్వారానో, డబ్బులు పంచడం ద్వారానో సాధ్యం కాదు అంటూ నారా లోకేష్ మాట్లాడారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనకు వచ్చిన నారా లోకేష్ కు టీడీపీ నేతలు, మంత్రులు సాదర స్వాగతం పలికారు. 

ఈ పర్యటనలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తన భార్య బ్రాహ్మణి సహకారం లేకపోతే తాను ఏ కార్యక్రమాన్నీ విజయవంతంగా నిర్వహించలేనని, తన తల్లి భువనేశ్వరి ఎంతో త్యాగం చేయడం వల్లే, చంద్రబాబు గారు రాష్ట్రానికి సేవ చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క మహిళల గౌరవాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని లోకేష్ అన్నారు.  

తల్లికి వందనం పథకం పట్ల ప్రతి తల్లి తమ పిల్లను చదివించుకోగలుగుతున్నారని, ప్రతి మహిళా తల్లికి వందనం పథకం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని లోకేష్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నేతలు ఎలా మాట్లాడారో ప్రజలందరూ గమనించారని, ప్రతి ఒక్కరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. 

Nara Lokesh :

Nara Lokesh -Red Book
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs