పవన్ కళ్యాణ్ తో OG లో నటించి క్రేజీ బ్యూటీగా మారిన ప్రియాంక మోహన్ సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంప్రదాయానికి కేరాఫ్ గా ఉండే ప్రియాంక మోహన్ ఇప్పుడు కూడా శారీ లో నిజంగా బ్యూటిఫుల్ లుక్ తో అద్దరగొట్టింది.
లూజ్ హెయిర్ తో ప్రియాంక మోహన్ సన్ రైజ్ ని చూస్తూ మెస్మరైజ్ చేసింది. తెలుగులో నాని తో రెండు సినిమాల్లో నటించినా, శర్వాతో నటించినా రాని క్రేజ్ ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబోలో తెరకెక్కిన OG లో నటిస్తుంది అనగానే అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్ గా OG షూటింగ్ కూడా పూర్తయ్యింది.
సెప్టెంబర్ లోనే పాన్ ఇండియా మూవీ గా OG రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం హిట్ అయితే ప్రియాంక మోహన్ కి టాలీవుడ్ లోనే కాదు పలు భాషల వారు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినా ఆహ్వానిస్తారు. OG తర్వాత ఆమె క్రేజీ అవకాశాలు అందుకోవడము ఖాయమే.