వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రాడ్ చేసిన వైసీపీ నేతలు, నోరు పారేసుకున్న వైసీపీ యాక్టివిస్ట్ లు చాలామంది కూటమి ప్రభుత్వంలో జైలు పాలయ్యారు. అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయి అక్రమాలు చేసిన నేతలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు చాలామందిని కూటమి ప్రభుత్వం ఆధారాలతో సహా అరెస్ట్ చేసి జైలుకు పంపించింది, పంపిస్తుంది.
ఈవీఎం లను ధ్వంశం చేసిన పిన్నెల్లి మొదలు, నందిగం సురేష్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, కాకాణి, ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. తప్పు చేసిన చాలామంది నేతలు జైలుకెళ్లారు, రీసెంట్ గా సాక్షి జర్నలిస్ట్ కొమ్మనేని ఆధ్వర్యంలో అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చెయ్యగా కొమ్మినేని ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అలా జైలుకెళ్లిన వారందరిని వైసీపీ అద్యక్షడు జగన్ ఆయా జైళ్లకు వెళ్లి పరామర్శించి వస్తున్నారు.
అంతేకాదు చాలామంది నేతల కోసం లాయర్లను పెడుతున్నారు జగన్. కొమ్మినేని కోసం కూడా లాయర్ పొన్నవోలు దిగారు. పోసానికి, ఇలా చాలామంది వైసీపీ వాళ్లకు జగన్ లాయర్లను పెడుతూ బిజీ అయ్యారు. మరి అక్రమార్కులను అలా వదిలెయ్యకుండా లాయర్ ను పెట్టి మరీ జగన్ విడిపిస్తున్నారు అంటే.. అది ప్రజల్లోకి ఎలా వెళుతుందో ఆయనకే అర్ధం కావడం లేదు అనేది బ్లూ మీడియా బాధ.
మరోపక్క జగన్ సజ్జల రామకృష్ణ విషయంలో అత్యంత సానుకూలంగా ఉండడం పై బ్లూ మీడియా నెత్తినోరు బాదుకుంటుంది అది జగన్ చెవికి మాత్రం చేరడమే లేదు.