ఫైనల్ గా వైసీపీ నేత వల్లభనేని వంశీ కి బెయిల్ లభించింది. ఆరోగ్యం సరిగా లేదు అంటూ చెకప్ కోసం ఏపీ హై కోర్టుని ఆశ్రయించిన వంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. రెండు నెలల క్రితం అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలు కేసుల్లో బెయిల్ రాక వంశీ జైల్లోనే ఉన్నారు.
ఈమద్యలో వల్లభనేని వంశీ శ్వాస కోశ వ్యాధితో ఇబ్బంది పడి గుంటూరు GGH లో చికిత్స పొందినప్పటికి.. వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో ఆయన హై కోర్టులో బెయిల్ కోసం అప్లై చేసారు. ఎట్టకేలకు వల్లభనేని వంశీ నిరీక్షణ ఫలించింది. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.
వైద్యం కోసం వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అంతేకాదు వంశీకి వెంటనే వైద్యం అందించాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. వెంటనే వంశీని విజయవాడ ఆయూష్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.