మాజీ మంత్రి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉండి పోలీసులకు చుక్కలు చూపించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు నిన్న బెంగుళూరులోని ఓ రిసార్ట్ లో పోలీస్ లకు చిక్కారు.
పోలీసులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన ముందస్తు బెయిల్ వచ్చేవరకు ఆయన అజ్ఞాతంలోనే ఉండాలనుకుంటే. చివరికి పోలీసులకు చిక్కక తప్పలేదు. ఆయనని నెల్లూరు జిల్లా పోలీసులు కోర్టులో హాజరుపరిచగా ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. దానితో కాకాణి ని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.