Advertisement

ఫాన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీస్ కూడా


మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ పై ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాని ఫస్ట్ షో కే చూసెయ్యాలనే ఆత్రం తో ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ లో తెల్లవారి ఝామునే వేసే బెన్ఫిట్ షోస్ కోసం అనేమంది సెలబ్రిటీస్ టికెట్స్ కోసం ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ షోని కేవలం ఫాన్స్ మాత్రమే చూడ్డానికి వెళుతుంటారు. తెల్లవారి ఝాము నుండే థియేటర్స్ దగ్గర ఫాన్స్ చేసే రచ్చ ఆ షోస్ దగ్గర కనిపిస్తుంది. కానీ ట్రిపుల్ ఆర్ విషయంలో ఆ షో కి సెలబ్రిటీస్ కూడా వెళ్లేందుకు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది.

Advertisement

ప్రతి ఒక్కరూ ట్రిపుల్ ఆర్ ఫీవర్ తో కొట్టుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి రోజులు దగ్గరయ్యే కొలది అందరిలో ఆసక్తి అంచనాలు అంతకంతకు పెరిగిపోతుంది. హీరోల ఫాన్స్ లో అలాంటి ఆత్రం, క్యూరియాసిటీ ఉండడం చాలా సహజం. కానీ ఇప్పుడు రాజమౌళి సినిమా కావడంతో ఇండస్ట్రీ ప్రముఖులు ట్రిపుల్ ని వీక్షించేందుకు స్పెషల్ షోస్ వెయ్యమంటూ ఒత్తిడి చెయ్యడం గమనార్హం, ఆయా ప్రముఖులు ఫామిలీస్ తో ట్రిపుల్ ఆ ర్ ని చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని, స్పెషల్ షోస్ కానీ, మల్టిప్లెక్స్ ల్లో కొన్ని ట్రిపుల్ ఆర్ షోస్ సెలెబ్రిటీస్ కోసం వెయ్యమని ట్రిపుల్ ఆర్ టీం కి రిక్వెస్ట్ పెడుతున్నారట. 

Not only fans, but also celebrities:

Celebrities who say waiting for RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement