Advertisement

ఈ రోజు ఈడీ ఎదుట తరుణ్


సెప్టెంబర్ మొదటి వారం నుండి మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ లో 12 మంది సెలబ్రిటీస్ ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రానా దగ్గర నుండి రకుల్, పూరి, ఛార్మి, నందు, నవదీప్, తనీష్ ఇలా అందరూ ఈడి అధికారులు ముందు విచారణకు హాజరయ్యారు. ఇక మధ్యలో ఎక్సయిజ్ అధికారులు పూరి, తరుణ్ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ నమూనాలు లేవంటూ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఈ డ్రగ్స్ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి - టీఆరెస్ కేటీఆర్ మధ్యన మాటల యుద్ధం జరగగా.. కేటీఆర్ రేవంత్ రెడ్డి పై పరువు ష్టం దావా వేసారు. 

Advertisement

ఇక ఈ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు చివరిగా హీరో తరుణ్ ఈడీ అధికారుల ముందు హాజరవుతున్నారు. ఈ విచారణలో తరుణ్ ని నవదీప్ తో సంబంధాలు, ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీ విషయాలు, కెల్విన్ తో తరుణ్ కి ఉన్న సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై విచారణ జరపనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ కేసులో ఈ రోజు తరుణ్ చివరి వాడిగా ఈడీ ఎదుట హాజరవుతున్నారు.  

Hero Tarun at ED Office:

Hero Tarun at ED Office Hyderabad 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement