Advertisement

పెళ్లి చేసుకుంది.. ఇంటికి సమన్లు వచ్చాయి


తెలుగులో తరుణ్, అల్లు శిరీష్, నితిన్ సరసన సినిమాలు చేసిన యామి గౌతమ్ కి టాలీవుడ్ కలిసిరాలేదనే చెప్పాలి. దానితో బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడే అవకాశాల కోసం ఎదురు చూసింది. అప్పుడో ఇప్పుడో బాలీవుడ్ లో కాబిల్, సర్కార్ త్రీ, ఉరి ది సర్జికల్ స్ట్రైక్, గిన్నీ వెడ్స్ సన్నీ సినిమాలతో పేరు తెచ్చుకుని హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో బాగా ఫెమస్ అయిన యామి గౌతమ్ లాక్ డౌన్ లో చెప్పాపెట్టకుండా సైలెంట్ గా పెళ్లి పీటలెక్కేసింది. ఉరి సినిమా దర్శకుడు ఆదిత్య ధార్ తో ప్రేమలో పడి లాక్ డౌన్ లో కామ్ గా పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైంది. 

Advertisement

అయితే తాజాగా యామి చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తుంది. ఈడి అధికారుల ముందు జులై 7 న హాజరు కావాల్సిందిగా యామి గౌతమ్ కి ఈడి సమన్లు జారీ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. యామి గౌతమ్ పర్సనల్ బ్యాంకు ఖాతాలో కోటిన్నర విదేశీ మారక లావాదేవీలు జరిగాయని.. కానీ యామి దీని గురించి అధికారులకు తెలియజేయలేదని తెలుస్తోంది. దానితో విచారణ చేపట్టిన అధికారులకు బ్యాంకు ఖాతాలను యామి గౌతమ్‌తో అనుసంధానించినట్లు తేలిందని.. ఆ తర్వాతే యామి గౌతమ్ కి సమన్లు​​ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. జులై 7 న యామి ఈడి అధికారుల ముందు హాజరవ్వాల్సి ఉంది. 

ED summons Yami Gautam :

Trouble for Yami Gautam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement