Advertisement

శ్రీకారం నిర్మాతలతో శర్వానంద్ గొడవ


కాంట్రవర్సీలకు దూరంగా ఉండే హీరో శర్వానంద్ కి కాలం కలిసొచ్చి హిట్ పడినా బాక్సాఫీసు వద్ద కాసుల గలగలలు వినిపించడం లేదు. ఆయన రీసెంట్ మూవీ జాను హిట్ అన్నారు. కలెక్షన్స్ రాలేదు. ఇక తాజాగా మార్చి లో విడుదలైన శర్వానంద్ శ్రీకారం మూవీ అంతే. బావుంది అన్నారు.. బాక్సాఫీసు షేక్ చేసింది లేదు. కిషోర్ దర్శకత్వంలో మార్చి 11న విడుదలైన  శ్రీకారం.. కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు ముందు వెలవెల బోయింది. లేదంటే ఆ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చేవని ట్రేడ్ నిపుణులు అంచనా. 14 రీల్స్ బ్యానర్ లో రామ్ అచంట, గోపీచంద్  ఈ సినిమాని నిర్మించారు.

Advertisement

అయితే ప్రస్తుతం శ్రీకారం నిర్మాతలకు, శర్వానంద్ కి మధ్యన వివాదం మొదలైంది అని అంటున్నారు. అది కూడా శర్వానంద్ రెమ్యునరేషన్ విషయం లో నిర్మాతలతో గొడవపడినట్లుగా ఫిలిం నగర్ టాక్. రెమ్యూనరేషన్ విషయంలో నోటీసులు నిర్మాతలకు శర్వా పంపినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలకు కాస్త నష్టం జరుగగా.. సినిమా విడుదల తర్వాత మిగిలిన రెమ్యునరేషన్ ఇస్తామని శర్వానంద్ కు రెమ్యూనరేషన్ ను నిర్మాతలు పెండింగులో పెట్టడంతో.. శర్వా చూసి చూసి ఆ నిర్మాతలకు పారితోషకం విషయంలో లీగల్ గా ప్రొసీడ్ అయ్యి నోటీసు లు పంపినట్లుగా టాక్.  

Sharwanand slaps legal notice to his producers:

Sharwanand unhappy with Sreekaaram producers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement