Advertisement

నంది అవార్డు చిత్రం దర్శకుడి కొత్త చిత్రమిదే!


గతంలో నంది అవార్డు పొందిన చిత్రం ‘హితుడు’. 2015లో కె.ఎస్.వి. బేనర్ మీదుగా విడుదలైన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అందులో నక్సలైట్‌గా జగపతిబాబు పాత్రను తీర్చిదిద్దిన విధానం, మలయాళీ నటి మీరానందన్ తన పాత్రలో ఒదిగిపోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్ర దర్శకుడైన కె. విప్లవ్ ఇప్పుడు నూతన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కేఎస్వీ సమర్పణలో సిరంజ్ సినిమా పతాకంపై ఓ సున్నితమైన ప్రేమకథాచిత్రంగా ఆయన దీనిని మలచనున్నారు. 

Advertisement

‘ప్రేమకు రెయిన్ చెక్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన అభిలాష్.., ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాల్లో నటించి, మెప్పించిన రాఘవ్ కథానాయకులుగా ఈ చిత్రానికి ఎంపికయ్యారు. ఈ తరం యువత జీవనశైలికి దగ్గరగా ఉంటుందని, ఆద్యంతం మనసును రంజింపజేసే సన్నివేశాలతో పాటు ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లుగా దర్శకుడు కె. విప్లవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్ర్కిఫ్ట్ పనులు పూర్తికావచ్చాయని, త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సమర్పణ: కేఎస్వీ.

Nandi Award Winner Director New Film Details:

Hithudu Movie Directors’s New Film Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement