Advertisement

రాజ్ తరుణ్ మరో చిత్రం మొదలైంది..!


రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె. రాధామోహన్‌ కొత్త చిత్రం ప్రారంభం 

Advertisement

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా హిట్‌ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యువ దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌ నెం.8’ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జూన్‌ 19 ఉదయం 8.30 గంటలకు జరిగాయి. 

ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ..‘‘ ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘పంతం’ వంటి మంచి హిట్‌ చిత్రాల తర్వాత మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో చేస్తున్న మరో మంచి కథా చిత్రం ఇది. రాజ్‌ తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఇది మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’’ అన్నారు. 

దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘మూడు సంవత్సరాల పాటు వర్క్‌ చేసి రెడీ చేసిన అద్భుతమైన ఈ కథను రాధామోహన్‌గారు విన్న వెంటనే స్టార్ట్‌ చేద్దాం అన్నారు. రాజ్‌ తరుణ్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కంటే మంచి కథ ఇది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ రాధామోహన్‌గారి బేనర్‌లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. 

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. 

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: ఆండ్రూస్‌, మాటలు: నంద్యాల రవి, ఆర్ట్‌: రాజ్‌కుమార్‌, కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, మేకప్‌: శివ, కాస్ట్యూమ్స్‌: నాగులు, స్టిల్స్‌: ఆనంద్‌, పబ్లిసిటీ: ధని ఏలె, నిర్మాత: కె.కె. రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Raj Tarun, Konda Vijay Kumar Film Launched :

Raj Tarun Movie in Sri Satyasai Arts Banner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement