Advertisement

సత్యం థియేటర్ పై బన్నీ కన్ను పడింది


ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగానికిపైగా థియేటర్ల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్న అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ఇప్పుడు కొత్తగా సత్యం థియేటర్ మీద ప్రత్యేకించి కాన్సన్ ట్రేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మీరు ఆలోచించేస్తున్నారా?. మీరు నమ్మినా, నమ్మకపోయినా గీతా ఆర్ట్స్ సాక్షిగా ఇది నిజం. ఈమధ్య మహేష్ బాబు "ఎ.ఎం.బి సినిమాస్"తో మల్టీప్లెక్స్ రంగంలోకి దిగడంతో.. మహేష్ ను స్ఫూర్తిగా తీసుకొని అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ రంగంవైపు అడుగులేయనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Advertisement

అందుకోసం సిటీకి సరిగ్గా సెంటర్ లో ఉన్న సత్యం థియేటర్ ను ఎంచుకున్నాడట. పైకి కనిపించదు కానీ.. ఆ థియేటర్ ఉన్న ప్లేస్ చాలా పెద్దది. అందుకే.. థియేటర్ ను మొత్తానికి కూలగొట్టి.. ఆ స్థానంలో ఓ మల్టీప్లెక్స్ ను నిర్మించే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. ఈమేరకు ప్లానింగ్ అంతా పూర్తైందని, త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది. 

"నా పేరు సూర్య" డిజాస్టర్ తర్వాత ఇప్పటివరకూ తన తదుపరి చిత్రం ఏమిటనే విషయంలో క్లారిటీ ఇవ్వని అల్లు అర్జున్ ఇప్పుడు బిజినెస్ పై కాన్సన్ ట్రేట్ చేస్తుండడంతో.. ఇప్పుడప్పుడే ఆయన నెక్స్ట్ సినిమా గురించి కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Allu Arjun Planning to Start Multiplex Business:

Allu Arjun planning to start multiplex business
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement