Advertisement

ఎన్టీఆర్, విజయ్, అట్లీపై.. అశ్వినీదత్ క్లారిటీ!


చాలా కాలం తర్వాత ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన బ్యానర్ వైజ‌యంతీ మూవీస్‌. ఆ సినిమాతో వారికి పెద్దగా పేరు రాలేదు కానీ ఆ తర్వాత నిర్మించిన ‘మ‌హాన‌టి’తో పూర్తి ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో తెరకెక్కిన ‘దేవదాస్’ చిత్రం ఈనెల  27న విడుద‌ల అవ్వబోతోంది. ఈ సినిమా విషయంలో రిలీజ్‌కి ముందే ఈ సంస్థ టేబుల్ ప్రాఫిట్‌ని ద‌క్కించుకున్నట్లుగా టాక్.

Advertisement

ఈ ఉత్సాహంతోనే మ‌రిన్ని కొత్త సినిమాల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతోంది ఈ సంస్థ. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాని, విజయ్ దేవ‌ర‌కొండ‌తో మరో సినిమాని త్వరలో నిర్మించబోతున్నట్లుగా నిర్మాత అశ్వినీదత్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు డైరెక్టర్స్ తోనే కాకుండా తమిళ డైరెక్టర్‌తో కూడా ఓ మూవీ చేయబోతోన్నట్లుగా ఆయన ప్రకటించారు.

తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా త్వరలోనో ఉంటుందని, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి క‌థా చ‌ర్చ‌లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ లేదా విజయ్ తో అట్లీ ఈ బ్యానర్ లో సినిమా చేసే అవకాశముందని టాక్. రాజమౌళి మ‌ల్టీస్టార‌ర్ తర్వాత ఎన్టీఆర్ ఈ బ్యానర్ లో చేయనున్నాడట. మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఈ బ్యానర్.. ఏ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Ashwini Dutt About His Future Movies:

Ashwini Dutt Latest interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement