Advertisement

శిరీష్ 'పెళ్లి చూపులు' ఫెయిల్..!


ఎక్కడ చూసినా 'పెళ్లి చూపులు' హిట్ గురుంచే అందరూ మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాగా వచ్చి కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం గురుంచి ఇప్పుడు ఒక వార్త ప్రచారం లోకి వచ్చింది. అదేమిటంటే 'పెళ్లిచూపులు' సినిమాని పూర్తి చేసిన తర్వాత డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమా ని ఏదైనా పెద్ద నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేస్తే మంచి పేరు దానికి తోడు డబ్బు కూడా వస్తుందని అనుకుని ముందుగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ని సంప్రదించాడట. అయితే ఈ సినిమా తీసిన విధానం ఇంకా కథ నచ్చి..... దీనిలో అల్లు శిరీష్ నటిస్తే బావుంటుందని అనుకుని తనకి 'పెళ్లిచూపులు' సినిమా అమ్మెయ్యమని అడిగాడట. అయితే వాళ్ళు గనక సినిమాని అమ్మేస్తే ఈ సినిమాని అల్లు శిరీష్ తో రీ షూట్ చెయ్యాలని అల్లు అరవింద్ ప్లాన్ వేసాడట. శిరీష్ ఇప్పటి వరకు రెండు, మూడు సినిమాలలో నటించిన కూడా పెద్దగా పేరు రాలేదు అందుకే ఈ సినిమాలో గనక శిరీష్ నటిస్తే మంచి పేరు వస్తుంది.... ఇంకా అలాగే డబ్బు కూడా వస్తుందని అరవింద్ ఆశించాడట. కానీ తరుణ్ భాస్కర్ దీనికి ఒప్పుకోలేదట. ఇక తర్వాత ఈ చిత్ర యూనిట్ నిర్మాత సురేష్ బాబుని కలవడం అయన తన సంస్థ ద్వారా సినిమా రిలీజ్ చెయ్యడం, అది మౌత్ టాక్ తో ఇంకా పబ్లిసిటీ తో పెద్ద హిట్ అయ్యి కూర్చోవడం చకచక జరిగిపోయాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని తెలిసే అల్లు అరవింద్ ఆవిధంగా ప్లాన్ వేసాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇన్ని తెలివితేటలు ఉండబట్టే  అల్లు అరవింద్ ని అపరచాణిక్యుడు అని అభివర్ణిస్తారు.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement