Advertisement

బిజీ బిజీ... పవన్‌ బిజీ...!


ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్‌ నిర్మించే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం 'వీరం' మూలకధను ఆధారంగా చేసుకొని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్‌ నటిస్తున్నాడు. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయాలని పవన్‌ దర్శకనిర్మాతలకు స్పష్టం చేసేశాడు. ఈ చిత్రం తర్వాత పవన్‌ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఎప్పటనుండో ఎ.యం.రత్నం పవన్‌తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాడు. పవన్‌తో తాను ఓ సినిమా నిర్మించబోతున్నట్లు రత్నం కూడా అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశాడు. తమిళంలో తానే నిర్మాతగా అజిత్‌ హీరోగా చేసిన 'వేదాలం' చిత్రానికి రీమేక్‌గా ఈచిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి తమిళ 'జిల్లా' దర్శకుడు నీసన్‌ దర్శకత్వం చేయనున్నట్లు సమాచారం. ఇక దాసరితో కూడా పవన్‌కు ఓ చిత్రం కమిట్‌మెంట్‌ ఉంది. సో.. మరో మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలలోకి ఎంటర్‌ అవుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి పవన్‌ చేస్తున్న చిత్రాలు, ఆయన కమిట్‌మెంట్స్‌ వింటుంటే ఆయన మూడేళ్ల డైరీ ఇప్పటికే ఫుల్‌ అయినట్లు కనిపిస్తోంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement