Advertisement

మాయావతికి మాంచి అస్త్రం దొరికింది!


వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలామంది ఎస్పీ, బీఎస్పీ నాయకులు వారి పార్టీలకు బై చెబుతూ బిజెపి పంచన చేరుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా రాజకీయ సమీకరణాలుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. ఈ సమయంలో బిజెపి నేత దయాశంకర్‌సింగ్‌ మాయావతిపై కొన్ని వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. వాటిల్లో వాస్తవం ఉన్నప్పటికీ ఓ దళిత మహిళను ఇలా కించపరుస్తున్న బిజెపిని దళిత వ్యతిరేక పార్టీగా మాయావతి అండ్‌ కో ప్రచారం చేస్తున్నారు. వీరి వాదనకు దళితులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం మాయావతికి ఓ వరంగా మారిందనేది మాత్రం వాస్తవం. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement