Advertisement

మరోసారి అక్షయ్‌ రెడీ..!


బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ అంటే స్పీడుగా చిత్రాలు పూర్తి చేయడంలో స్పెషలిస్ట్‌ అనే పేరుంది. కాగా ఆయన తన చిత్రాలను రెండూ మూడు నెలల్లోనే పూర్తి చేస్తుంటాడు. కాగా బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌-నీరజ్‌పాండేల కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 'బేబి, స్పెషల్‌ చబ్బీస్‌' చిత్రాలు వచ్చాయి. అలాగే ఇటీవల అక్షయ్‌కుమార్‌ నటించిన 'ఎయిర్‌లిఫ్ట్‌'కు కూడా నిర్మాతల్లో నీరజ్‌పాండే ఒకడు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పుడు మరో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం పేరు 'రుస్తుం'. ఇందులో హీరోయిన్‌గా ఇలియానాను ఎంపిక చేశారు. రెండో హీరోయిన్‌గా ఇషాగుప్తాను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని నీరజ్‌పాండేతో పాటు అనిల్‌ అంబాని వంటి వారు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా మూడు నెలల్లో పూర్తి చేయాలని అక్షయ్‌ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఒకవైపు శంకర్‌-రజనీల కాంబినేషన్‌లో 'రోబో2.0' చేస్తూనే.. అదే సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి జూన్‌లో రిలీజ్‌ చేయాలనేది అక్షయ్‌ ప్లానింగ్‌గా చెబుతున్నారు. మరి ఈ సారి అక్షయ్‌కుమార్‌-నీరజ్‌పాండేల కాంబినేషన్‌లో వస్తోన్న 'రుస్తుం' ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement