Advertisement

'విశ్వరూపం 2'ను గాలికొదిలేశారు..!


విశ్వనటుడు కమల్‌హాసన్‌ తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పుడో పూర్తి అయినా విడుదల కావడం లేదు. ఈ ఏడాది కూడా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని చెన్నై సినిమా వర్గాల సమాచారం. అయితే ఇలా విడుదల ఆలస్యం కావడానికి కారణం నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ అని తేల్చిచెప్పిన కమల్‌ తాను కూడా ఈ చిత్రంపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. కమల్‌ పట్టుబట్టి ఉంటే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్‌ అయివుండేదని అంటున్నారు. అయితే కమల్‌ కూడా ఈ చిత్రం విషయంలో ఎందుకో తాత్సారం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇప్పుడు బయటకు లేవాలంటే కనీసం 25కోట్లు కావాలి. వడ్డీలు బాగా పెరిగిపోయాయి. అందుకే ఈ సినిమాని కమల్‌హాసన్‌ వదిలేశాడని అంటున్నారు. 'విశ్వరూపం' వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఇప్పుడు ఆ సినిమాపై ఎవ్వరికీ క్రేజ్‌ లేదు. కాబట్టి రిజల్ట్‌ కూడా ఎలా ఉంటుందో తెలియదు. అలాగే ఈ చిత్రం క్లైమాక్స్‌ సన్నివేశాలు అనుకున్న విధంగా రాలేదట. దాంతో కమల్‌హాసన్‌ కూడా అసంతృప్తిగా ఉన్నాడు. ఈ సన్నివేశాలను రీషూట్‌ చేయాలని ఆయన అనుకుంటున్నానరట. ఇవన్నీ ఇప్పుడు జరిగే పనులు కావని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement