Advertisement

22న 'కథాకళి'..!


విశాల్‌. కేధరిన్‌, రెజీనా హీరోహీరోయిన్లుగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'కథాకళి'. విశాల్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని వాస్తవానికి సంక్రాంతి బరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ తెలుగులో భారీ సినిమాలు పోటీలో ఉండటం, థియేటర్లు దొరక్కపోవడంతో ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే రోజున విడుదల చేయలేకపోయారు. తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకొంది. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 22న తెలుగులో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తెలుగులోనూ మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. పుల్‌లెంగ్త్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా తనకు మరో మంచి హిట్‌ను సాధించి పెడుతుందనే నమ్మకాన్ని హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌ అయిన విశాల్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కాగా ఈచిత్రానికి మాటలను శశాంక్ వెన్నెలకంటి అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని వెన్నెలకంటి, భువనచంద్రలు అందిస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement