Advertisement

వెంకీ నుండి నాగ్‌కు..?


ఈమధ్య ఎందువల్లో గానీ విక్టరీ వెంకటేష్‌ తన వద్దకు వస్తున్న చిత్రాలను, కథలను, దర్శకులను ఎక్కువగా తిప్పించుకుంటున్నాడు. చాలాగ్యాప్‌ రావడంతో ఆయన సినిమాలపై ఎలాంటి డెసిషన్స్‌ తీసుకోలేకపోతున్నాడని, కుటుంబ సమస్యల వల్లే ఆయన ఈ గ్యాప్‌ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి ఫీల్‌గుడ్‌ సినిమాల డైరెక్టర్‌ క్రాంతిమాధవ్‌తో వెంకటేష్‌ సినిమా చేయనున్నాడని, దీనికి పరుచూరి ప్రసాద్‌, పరుచూరి కిరిటీలు నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి సంతోషం సగం బలం అనే టైటిల్‌ను పెట్టినట్లుగా కూడా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ చిత్రం విషయంపై కూడా ఇప్పటివరకు వెంకీ తన నిర్ణయం ప్రకటించలేదని, వెంకీ చుట్టూ తిరిగి తిరిగి అలిసిసోయిన డైరెక్టర్‌ క్రాంతిమాధవ్‌ ప్రస్తుతం అదే కథను నాగార్జునకు వినిపించాడని తెలుస్తోంది. స్టోరీ బాగా నచ్చడంతో తాను ఈ సినిమా చేస్తానని నాగార్జున క్రాంతిమాధవ్‌కు మాట ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి వెంకీ కోసం తయారు చేసుకున్న కథ ఇప్పుడు నాగార్జున వద్దకు చేరింది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement