Advertisement

అన్నతో విభేదిస్తున్న తమ్ముడు..!


రామానాయుడు మరణం తర్వాత ఆ కుటుంబంలోని లుకలుకలు బయటపడుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. ఇంతకాలం తన అన్న సురేష్‌బాబుతో విభేదిస్తూ వచ్చిన వెంకటేష్‌ తన తండ్రి బతికున్నంతకాలం మౌనం వహించాడని, ఆయన మరణం తర్వాత ఇక సురేష్‌బాబుతో తెగతెంపులు చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడని టాక్‌. ఇప్పటికే ‘ఆ..నలుగరు’లో ఒకడైన సురేష్‌బాబు వ్యవహారశైలి వెంకీకి నచ్చదని, ఆర్దిక విషయాల్లో వెంకీ ఉన్నంత ఉదారంగా సురేష్‌బాబు ఉండడు అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో వెంకటేష్‌ త్వరలో తన సొంతబేనర్‌ను స్థాపించనున్నాడని, సురేష్‌ప్రొడక్షన్స్‌ను తన అన్నకే పూర్తిగా వదిలేయాలని భావిస్తున్నాడని, అందుకే తన నూతన చిత్రం విషయంలో కూడా వెంకీ తొందరపడటం లేదని సమాచారం. మొత్తానికి తండ్రి మరణం తర్వాత జరిగిన ఆస్తుల పంపకం వెంకీలో అసంతృప్తి రేగడానికి ప్రధానకారణం అంటున్నారు.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement