Advertisement

పవన్‌ తదుపరి చిత్రం ఏమిటి?


దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే దాసరికి చెందిన తారకప్రభు పతాకంపై కాకుండా సిరి మీడియా పతాకంపై ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి 'గోపాల గోపాల' దర్శకుడు డాలీ (కిషోర్ పార్ధసాని) దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని, డాలీతో పటు 'గోపాల గోపాల' మాటల రచయిత సాయిమాధవ్ బుర్ర ఈ చిత్రం స్క్రిప్ట్ లో పాల్గొని డైలాగ్ వెర్షన్ పై దృష్టి పెట్టాడని తెలుస్తుంది. పవన్ 'గబ్బర్ సింగ్2' విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో 'గబ్బర్ సింగ్2' కంటే ముందుగా దాసరి చిత్రమే ప్రారంభం అయ్యే అవకాసం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement