మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషించారు. కావాల్సినంత కామెడీ, గుండెల్ని తాకే ఎమోషన్స్ను మిళితం చేసి ఈ కథను కిషోర్ తిరుమల తెరపైకి తీసుకు వచ్చారు.
సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్కు రెడీగా ఉంది. మార్చి 13 నుంచి ఈ మూవీ జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా ప్రకటించారు.