గత ఏడాది అంటే 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్ల పెంపు ఆతర్వాత సమయానుకూంగా అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 వంటి పథకాలను నెరవేర్చిన కూటమి ప్రభత్వం ఇప్పుడు మరో పథకాన్ని నెరవేర్చేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, అలాగే ఈ విద్యా సంవత్సరం మొదలవుతున్న తరుణంలో రేపు అంటే జూన్ 12 నుంచి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించనుంది.
రేపే జూన్ 12నుంచి తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది
ఈ పథకంలో భాగంగా 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం
ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయం, 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు
తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేయనున్న కూటమి ప్రభుత్వం
1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు
అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ
విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీ.వో విడుదల చేసింది..
ఏపీ సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ లో భాగంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా లబ్ది చేకూరే పిల్లలు సిమీ చంద్రబాబు నో వేయినోళ్ల పొగిడేస్తున్నారు.