Advertisement

శంకరాభరణం తర్వాత నిఖిల్‌ చిత్రం ఇదే!


న్యూ జనరేషన్‌కు నచ్చే సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్‌ సూర్య వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ సొంతం చేసుకొని.. యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకొన్న నిఖిల్‌ సిద్దార్థ్..  శంకరాభరణం  అనంతరం నటించే  చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం మేఘన ఆర్ట్స్‌ పతాకంపై పి.వెంకటేశ్వర్రావు తన మొదటి చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి.. టైగర్‌ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తన ప్రతిభను ఘనంగా చాటుకున్న యువ ప్రతిభాశాలి వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

Advertisement

విజయదశమి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంబమైన ఈ చిత్రం నవంబర్ లో  సెట్స్ పైకి  వెళ్లనుంది.. ఈ చిత్రం టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నారు  

చిత్ర నిర్మాత-మేఘన ఆర్ట్స్‌ అధినేత పి.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. టైగర్ చిత్రంతో విజయం సాధించి, స్క్రీన్ ప్లే పరంగా  కొత్తదనాన్ని ఆవిష్కరించిన  వి.ఐ.ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తనదైన శైలిలో సరికొత్త కధలని ఎంచుకునే హీరో నిఖిల్‌ ఈ కధని సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకె చేసారు. సాయిశ్రీరాం, అబ్బూరి రవి, శేఖర్‌చంద్ర, చోటా కే ప్రసాద్ వంటి సక్సెస్ ఫుల్ టేక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటుల ఎంపిక పూర్తి చేసి.. నవంబర్‌ చివరిలో సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు. 

ఈ చిత్రానికి ఛీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌: విజయ్‌ కామిశెట్టి, కో-డైరెక్టర్‌: వరప్రసాద్‌ వరికూటి, ఆర్ట్‌: ఎ.రామాంజనేయులు, ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: సాయిశ్రీరాం, సహ నిర్మాత: డి.శ్రీనివాస్‌, నిర్మాత: పి.వెంకటేశ్వర్రావు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement