Advertisement

చైతూ మార్చి 20న హ్యాట్రిక్‌ హిట్‌ కొడతాడా..??


నాగ్‌చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'దోచేయ్‌' విడుదలకు సిద్ధమవుతోంది. 'స్వామి రారా' ఫేం సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక దీనికితోడు '1' ఫేం కృతిసనన్‌ నాగచైతన్యకు జోడిగా నటించడం కుర్రకారును కూడా ఈ సినిమా కోసం ఎదురుచూసేలా చేసింది. ఇప్పటికే షూటింగ్‌ అంతిమదశకు చేరుకున్న ఈ సినిమాను వచ్చే నెల 20న రిలీజ్‌ చేయడానికి సినిమా యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఉగాది సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమాను అప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. మరి దోపిడీ కథాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో చైతు డిఫరెంటుగా కనిపిస్తాడని సమాచారం. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement