Advertisement

'బెంగాల్ టైగర్' చిత్రం ప్రారంభం..!


రవితేజ, తమన్నా జంటగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక ఈ రోజు హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్ రాఘవేంద్ర రావు, వి.వి.వినాయక్, సురేందర్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ "ఇప్పటివరకు నేను నిర్మించిన చిత్రాలకు పాత్రికేయ మిత్రులంతా చాలా  సపోర్ట్ చేసారు. ఈ చిత్రానికి కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇది ఓ ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్ టైనింగ్ సినిమా. దర్శకుడు సంపత్ నందితో 'ఏమైంది ఈ వేళా ' సినిమా చేసాము.  ఆయన  'రచ్చ' సినిమా తరువాత మూడవ చిత్రం మాతో చేయడం చాలా సంతోషంగా ఉంది. మార్చి 2 వ తేదీ  నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఏప్రిల్ నుండి నిర్విరామంగా షూటింగ్ జరపనున్నాము. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము" అని చెప్పారు.

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ "రచ్చ సినిమా తరువాత సంపత్ నందితో ఈ సినిమా కోసం పని చేయడం చాలా సంతోషంగా ఉంది. రవితేజ తో ఎప్పటి నుంచో ఓ సినిమాలో నటించాలి అనుకుంటున్నా. ఈ చిత్రంతో నా కోరిక నెరవేరబోతోంది. షూటింగ్ ఎప్పుడు స్టార్ అవుతాదా అని వెయిట్ చేస్తున్నాను. రాశి ఖన్నా కూడా నటించనుండటంతో కాంబినేషన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది". అని అన్నారు.

ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు క్లాప్ ఇవ్వగా, వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దర్శకుడు సురేంద్ర  రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement