Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ: రాజ్ తరుణ్

Tue 12th Apr 2016 06:27 PM
raj tarun interview,eedo rakam aado rakam,vishnu  సినీజోష్ ఇంటర్వ్యూ: రాజ్ తరుణ్
సినీజోష్ ఇంటర్వ్యూ: రాజ్ తరుణ్
Advertisement

'ఉయ్యాలా జంపాలా','సినిమా చూపిస్త మావ','కుమారి 21ఎఫ్' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన రాజ్ తరుణ్ ప్రస్తుతం నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఈడో రకం.. ఆడో రకం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా చూసి చాలాసేపు నవ్వుకున్నా..

ఈ సినిమా కథ నాకు చెప్పే ముందు పంజాబీ సినిమా సీడీ ఇచ్చి చూడమన్నారు. ఆ సినిమా చూసి చాలాసేపు నవ్వుకున్నాను. ఆ తరువాత నాగేశ్వరరెడ్డి గారు నేరేషన్ ఇచ్చారు. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పాను. కథ ఒక్కటే అయినా.. కామెడీ విషయంలో కొన్ని మార్పులు చేశారు. చాలా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు. సినిమా షూటింగ్ చేస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. ఇదొక కన్ఫ్యూజన్ కామెడీ మూవీ. 

ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి బాగా ఎంజాయ్ చేస్తారు..

సినిమా మొదలయినప్పటి నుండి హిలారియాస్ కామెడీ ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ తమకు ఎదురైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి అబద్దాలు చెబుతూ ఉంటారు. అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. నేను అశ్విన్ అనే పాత్రలో కనిపిస్తాను.

ఎవరిని బ్లేమ్ చేయలేను..

నేను నటించిన మూడు సినిమాలను ఎంత ప్రేమించి చేసానో.. అలానే 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాను కూడా ఇష్టపడి చేశాను. సినిమా చూసినప్పుడు కూడా మంచి సక్సెస్ అవుతుందనే అనుకున్నాను కానీ మేము అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఆ విషయానికి ఎవరిని బ్లేమ్ చేయలేను. సినిమా రిజల్ట్ తెలిసిన తరువాత ఓ గంటసేపు బాధపడ్డాను. కావాలని ఎవరు పొరపాట్లు చెయ్యరు కదా..

విష్ణు అన్న అలా చెప్పాడు..

మోహన్ బాబు ఫ్యామిలీ అంటే డామినేషన్ ఉంటుందని అందరూ అనుకుంటారు. నా సన్నిహితులు కూడా కొందరు చెప్పారు. కాని ఆ ఫ్యామిలీకు దగ్గరైతేనే వారు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. విష్ణు అన్న చాలా కూల్ గా ఉంటారు. ఈ సినిమా చేయమని నాపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. విష్ణు అన్న అయితే తన రోల్ కంటే నా రోల్ ఎక్కువ ఉండేలా చూసుకోమని డైరెక్టర్ గారికి చెప్పారు.

హెబ్బా ప్రొడ్యూసర్స్ ఛాయిస్..

నాకు కూడా వేరే హీరోయిన్ తో వర్క్ చేయాలని అనిపిస్తుంది. కాని నాకు ఎవరు సెట్ కావట్లేదు. హెబ్బా హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం నా ఛాయిస్ కాదు ప్రొడ్యూసర్స్ ఛాయిస్.

ఆయన ఎనర్జీ నాకు ఉంటే బావుండేది..

రాజేంద్రప్రసాద్ గారు ఈ సినిమాలో విష్ణు తండ్రి పాత్రలో కనిపిస్తారు. మొదట ఆయనతో వర్క్ చేయాలంటే భయపడ్డాను. సీనియర్ నటుడు కదా.. సీరియస్ గా ఉంటారేమో అనుకున్నాను. కానీ సెట్ లో ఆయన చాలా ఎనర్జీగా ఉంటారు. ఆయన ఎనర్జీలో 10 శాతం నాకు ఉంటే బావుంటుందనిపిస్తుంది.

కథ రాసుకున్నా..

ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను. కాని నా కోసం కాదు. ఇప్పుడైతే డైరెక్ట్ చేసే ఆలోచన లేదు. ఫ్యూచర్ లో చేస్తా..

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

మారుతి గారి ప్రొడక్షన్ లో ఒక సినిమా, దిల్ రాజు గారి బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాను. అలానే గీతా ఆర్ట్స్, వంశీ గారి సినిమాలు స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement