Advertisement

‘మా’ అధ్యక్షుడు నేపాల్‌ని ఆదుకోవాలి!

Mon 27th Apr 2015 02:20 AM
maa president,rajendra prasad,nepal,earthquake,help  ‘మా’ అధ్యక్షుడు నేపాల్‌ని ఆదుకోవాలి!
‘మా’ అధ్యక్షుడు నేపాల్‌ని ఆదుకోవాలి!
Advertisement

వెయ్యి అణుబాంబులు ఒక్కసారిగా ప్రయోగించినట్లు భూకంపం నేపాల్‌ని నేలమట్టం చేసింది. టూరిజంమీద మనుగడ సాగిస్తున్న ఈ సుందర ప్రదేశం చిన్నాభిన్నమైంది. మృతులు, క్షతగాత్రులతో కఠ్మాండు రోదిస్తోంది. ఈ భూకంపం భారత్‌, చైనా, భూటాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లనూ వణికించింది. భారత్‌లో మృతులసంఖ్య 50కి పైబడినా నేపాల్‌ని ఆదుకోవడానికి భారతప్రధాని స్పందించిన తీరు మనకు ఆదర్శం. మనమధ్యే బతుకుతున్న మనలో ఒకరిగా కలిసిపోయిన నేపాలీల కుటుంబాలెన్నో నేపాల్‌లో వున్నాయి, భూకంపానికి బలయిపోయాయి. ఉసూరుమంటున్న ఈ నేపాలీలను ఆదుకోవడం ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికయిన రాజేంద్రప్రసాద్‌ తక్షణ కర్తవ్యం. ఫిలిమ్‌ ఛాంబర్‌ కార్యవర్గంతో చర్చించి మందులు, ఆహారం, వస్త్రాలు వంటి అత్యవసర వస్తువులను అందించాలి. నిధి సేకరణకు నడుం కట్టాలి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement