Advertisement

600కోట్ల సినిమాలో అన్నీ సంచలనాలే..!

Wed 29th Mar 2017 07:55 PM
mohanlal randamoozham,big b,nagarjuna,600 crores,aishwarya rai  600కోట్ల సినిమాలో అన్నీ సంచలనాలే..!
600కోట్ల సినిమాలో అన్నీ సంచలనాలే..!
Advertisement

త్వరలో మోహన్‌లాల్‌ ముఖ్యపాత్రలో 600కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందనున్న మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. వాసుదేవనాయర్‌ రచించిన 'రాండామూజమ్‌' నవల ఆధారంగా అదే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఇది మహాభారతం ఆధారంగా రూపొందుతోంది. పౌరాణిక కథకు ఏమాత్రం వక్రీకరణలు లేకుండా ఈ నవల ఆదారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 

ఇక ఈ చిత్రానికి శ్రీకర ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తుండగా, పీటర్‌ హెయిన్స్‌ యాక్షన్‌ సన్నివేశాలకు పనిచేయనున్నారు. ఇక ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ భీముని పాత్రను చేయనుండగా, బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ భీష్మపితామహుని పాత్రను చేస్తున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు అఫీషియల్‌గా ప్రకటించాడు. ఇంతకు ముందు మోహన్‌లాల్‌తో కలిసి అమితాబ్‌ హిందీలో 'ఆగ్‌', మలయాళంలో 'కాందహార్‌' చిత్రాలలో కలిసి నటించారు. 

ఇక ఈ చిత్రంలో పాండవులుగా నాగార్జునతో పాటు విక్రమ్‌ వంటి అన్ని భాషల హీరోలు నటించే అవకాశం ఉందని సమాచారం. ఇక కీలకమైన ద్రౌపది పాత్రకు ఐశ్వర్యారాయ్‌ని నటించేందుకు ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ చిత్రం సంచలనాలకు కేంద్రబిందువుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement